ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) కోసం దావోస్కి, అలాగే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలకు వెళ్లినప్పుడు పెట్టుబడిదారులకు తెలంగాణ వ్యాపార హిత రాష్ట్రంగా రుజువైనట్లు రేవంత్ అన్నారు. దావోస్ సమ్మిట్లోనే రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఖరారైనట్లు తెలిపారు.
హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో గ్లోబల్ హబ్గా మారుతోందని చెప్పారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వివరించారు.