సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ బిడ్డల సత్తా

First Published Aug 4, 2020, 7:23 PM IST

అఖిల భారత సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే సివిల్స్ 2019 పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు. 

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన పిన్నాని సందీప్ వర్మ ఈరోజు విడుదల చేసిన యూపీఎస్సీ పరీక్షా ఫలితాలలో ఆలిండియా 244 ర్యాంకు సాధించాడు.
undefined
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన కుమారుడు వినయ్ కాంత్ (29) ఏడాది క్రితం రాజ్యసభ సెక్రెటరీ సెక్రటేరియట్ (AEO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ, సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. మంగళవారం ప్రకటించిన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 516 ర్యాంకు సాధించాడు.
undefined
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని గుండ్ల భావి గ్రామానికి చెందిన దాత్రి రెడ్డి ఐఏఎస్ ఫలితాల్లో 46వ ర్యాంకు సాధించింది. గతంలో ఈమె ఐపీఎస్ లో 283 సాధించి ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నారు.
undefined
ఐఎఫ్ఎస్ ఫలితాల్లో చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన బడేటి సత్య ప్రకాష్ గౌడ్ ఐఏఎస్ ఫలితాల్లో 218 ర్యాంక్ సాధించాడు. బడేటి అశోక్, వసంత దంపతుల కుమారుడు సత్య ప్రకాష్ గౌడ్. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. నల్గొండ, హైదరాబాద్‌లలో ప్రాథమిక విద్యను, ఐఐటీ పాట్నాలో బీ.టెక్ ను పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్ పరీక్షలకు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో సివిల్స్ రాసి మొదటి సారే 218 రాంక్ కైవసం చేసుకున్నాడు
undefined
click me!