అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తరువాత నిర్భంద పాలన నశించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులు నివాళులు అర్పించారు.
ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం అని.. దీనిమీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు అంటూ నినదించారు. కానీ కెసిఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే.