ఆంధ్ర ప్రదేశ్ లో నేడు ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే..
రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులపాటు అక్కడక్కడ భారీ, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడయి ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరీముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శుక్రవారం పార్వతీపురం మన్యం, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కూడా ఆకాశం మేఘాలతో కప్పేసి అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని… మిగతాచోట్ల వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.