ఢిల్లీలోనే బండి , ఈటల మకాం: జూపల్లి సహా ముగ్గురు నేతల చేరికపై హైకమాండ్‌తో చర్చలు

Published : Apr 13, 2023, 10:24 AM IST

బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  మాజీ మంత్రి ఈటల రాజేందర్ లు  ఢిల్లీలో ఉన్నారు.  బీజేపీలో  చేరికల విషయమై  పార్టీ నేతలతో  బండి సంజయ్  చర్చిస్తున్నారు.    

PREV
18
ఢిల్లీలోనే  బండి , ఈటల మకాం: జూపల్లి సహా  ముగ్గురు నేతల  చేరికపై  హైకమాండ్‌తో  చర్చలు
bandi sanjay

బీజేపీ  తెలంగాణ చీఫ్ బండి సంజయ్,  మాజీ మంత్రి ఈటల రాజేందర్  ఢిల్లీలో  మకాం వేశారు.  బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను  పార్టీలో  చేర్చుకొనే  విషయమై  జాతీయ నేతలతో  చర్చిస్తున్నారని  సమాచారం.

28
bandi sanjay

కాంగ్రెస్ పార్టీకి  చెందిన  ఎఐసీసీ  కార్యక్రమాల  అమలు కమిటీ చైర్మెన్  మహేశ్వర్ రెడ్డి  కూడా కాంగ్రెస్ ను వీడుతారని ప్రచారం సాగుతుంది.  ఈ ప్రచారాన్ని  కాంగ్రెస్ నేత  మహేశ్వర్ రెడ్డి ఖండిస్తున్నారు. పార్టీ వ్యతిరేక  కార్యకలాపాలకు  పాల్పడుతున్నారని మహేశ్వర్ రెడ్డికి ఆ పార్టీ  నాయకత్వం  నిన్న  షోకాజ్ నోటీసులు జారీ  చేసింది.  ఈ విషయమై  మల్లికార్జున ఖర్గే వద్దే తేల్చుకొంటానని  ఆయన  ప్రకటించారు.

38
brs flag

బీఆర్ఎస్  నాయకత్వంపై  తిరుగుబాటు  చేసిన  మాజీ మంత్రి జూపల్లి  కృష్ణారావు,.  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలపై  ఆ  పార్టీ నాయకత్వం  సస్పెన్షన్ వేటేసింది.  ఈ ఇద్దరు  నేతలను బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం  ఆసక్తిని చూపుతుంది

48
bandi sanjay

 రెండు రోజుల క్రితం  మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావుకు  ఉమ్మడి  మహబూబ్ నగర్  జిల్లాకు  చెందిన  బీజేపీ నేతలు  ఫోన్  చేశారు.  బీజేపీ నేతలు డికే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డిలు  ఫోన్  చేశారు.

58
bandi sanjay

మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డితో  బీజేపీ నేతలు  సంప్రదింపులుు జరుపుతున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.  ఈ ఇద్దరు  నేతలతో  కాంగ్రెస్ నేతలు  టచ్ లో  ఉన్నారు.  అయితే  ఈ ఇధ్దరు  నేతలు  ఏ పార్టీలో  చేరుతారనే  విషయమై  ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

68
bandi sanjay

రాష్ట్రంలో  చోటు  చేసుకున్న  రాజకీ పరిస్థితులు  పార్టీలో  చేరికలపై   జాతీయ  నేతలతో  చర్చించేందుకు  గాను  బండి సంజయ్ నిన్న  ఢిల్లీకి వెళ్లారు.. బీజేపీ  చేరికల కమిటీ చైర్మెన్  ఈటల రాజేందర్ కూడా  ఢిల్లీలోనే  ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  మహేశ్వర్ రెడ్డి  చేరికల  విషయమై  పార్టీ అగ్రనేతలతో  చర్చిస్తున్నారని  సమాచారం.  

78
bandi sanjay

తెలంగాణ రాష్ట్రంలోని  ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను  తమ పార్టీలో  చేర్చుకొనే విషయమై   బీజేపీ  అగ్రనేతలతో  రాష్ట్ర నేతలు  చర్చిస్తున్నారని  ప్రచారం సాగుతుంది.  తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది  చివర్లో  ఎన్నికలు  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో   అధికారాన్ని  కైవసం చేసుకోవాలని  బీజేపీ  పట్టుదలగా  ఉంది.  ఈ దిశగా బీజేపీ  నాయకత్వం  పావులు కదుపుతుంది.

88
bandi sanjay

రెండు తెలుగు రాష్ట్రాలపై  బీజేపీ  జాతీయ నాయకత్వం  దృష్టి పెట్టింది.  ఉమ్మడి  ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత వారంలో  బీజేపీలో  చేరారు.  కిరణ్ కుమార్ రెడ్డి  బీజేపీలో  చేరిక  రాజకీయంగా  ఆ పార్టీకి  ప్రయోజనం కల్గించే  అవకాశం ఉందని  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories