హైదరాబాద్: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కింద చేపడుతున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.