మంత్రి మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి: వైరానికి కారణమిదీ.....

First Published Aug 26, 2021, 1:33 PM IST

మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల మధ్య వైరం టీడీపీ నుండి కొనసాగుతోంది. 2014లో మల్కాజిగిరిలో తనను పోటీ చేయకుండా మల్లారెడ్డి అడ్డుకొన్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయంతో ఉన్నారు. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా నేతల సహాయంతో మల్లారెడ్డి తనను అడ్డుకొన్నారని రేవంత్ అనుమానం. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. పార్టీలు మారినా కూడ ఈ  వైరం మరింత పెరిగింది.
 

రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏఐసీసీలో రేవంత్ రెడ్డి కి టాప్ లెవెల్ సంబంధాలను పరిచయాలను తొలిసారి చేసింది కూడా డీకే శివకుమారేఅని అంటున్నారు. ఈ విషయాన్నీ పక్కకుపెట్టినా శివకుమార్ ప్రాక్టికల్ నేత. కాబట్టి పాపులారిటీ విషయంలో కానీ, కేసీఆర్ ని ఎదుర్కోవడం విషయంలో కానీ రేవంత్ రెడ్డే ముందున్నాడని ఆయన గ్రహించి రేవంత్ కే పీసీసీ పగ్గాలను అప్పగిస్తాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వైరం టీడీపీలో ఉన్న సమయం నుండే కొనసాగుతోంది. 2014 ఎన్నికల సమయంలో ఈ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు చోటు చేసుకొన్నాయి. ఆ తర్వాత కూడ అవి కొనసాగాయి.

2014లో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని భావించాడు. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఏడాది ముందుగానే రంగం సిద్దం చేసుకొన్నారు. 
 

chandrababu

మల్కాజిగిరి  నుండి చంద్రబాబు రేవంత్ రెడ్డి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొడంగల్ నుండి తన సోదరుడిని బరిలోకి దింపాలని రేవంత్ ప్లాన్ చేసుకొన్నాడు.  

MEDCHAL_Malla-reddy.CH

అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి ప్లాన్‌కు మల్లారెడ్డి చెక్ పెట్టారు. మల్కాజిరిగి ఎంపీ స్థానం నుండి మల్లారెడ్డి పోటీ చేయడానికి ఆసక్తిని చూపాడు. ఈ విషయమై ఆయన చంద్రబాబును కూడ కలిశాడు.

manchireddy kishan reddy


మల్లారెడ్డి మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయించేందుకు అప్పటి టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు.

mla manchireddy

మల్కాజిగిరి ఎంపీ స్థానంలో రేవంత్ రెడ్డి పోటీ చేయడానికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి  వ్యతిరేకించారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి స్థానికేతరుడనే వాదనను తెరమీదికి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వారినే ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని ఆ  జిల్లా నేతలు వాదించారు.

ఈ వ్యూహం మనకు అర్థం కావాలంటే... 2019 ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి పరిశీలించాలి. ఆ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో అపూర్వ విజయాన్ని సాధించింది. రాయలసీమలో అయితే మూడు స్థానాలు మినహా మిగతావన్నీస్వీప్ చేసింది. రాయలసీమలో టీడీపీ నుండి గెలిచింది చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ మాత్రమే. జేసీ సోదరులు, పరిటాల కుటుంబీకులు వంటి రాజకీయ ఉద్దండులే జగన్ ఫ్యాన్ గాలిలోకొట్టుకుపోయారు.


ఈ విషయమై చంద్రబాబు నివాసంలో రేవంత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. రంగారెడ్డి జిల్లా నేతలు మల్లారెడ్డిని రంగంలోకి దింపి తనను మల్కాజిగిరి  నుండి పోటీ చేుయకుండా అడ్డుకొన్నారని  రేవంత్ భావిస్తున్నారు.

revanth

 రంగారెడ్డి జిల్లా నేతలను మల్లారెడ్డి ఒప్పించి మల్కాజిగిరి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.

malla reddy

2014 తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. రేవంత్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018 ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ అసెంబ్లీ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకొన్నారు. 2019 ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 

MEDCHAL_Malla-reddy.CH

సమయం వచ్చినప్పుడల్లా రాజకీయంగా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పై  చేయిసాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు. తాజాగా మల్లారెడ్డి  విద్యాసంస్థల్లో అవినీతిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై  రేవంత్ రెడ్డిని రాజీనామా చేయాలని  మల్లారెడ్డి  సవాల్  చేశారు.

click me!