Published : Aug 07, 2023, 12:11 PM ISTUpdated : Aug 07, 2023, 12:12 PM IST
పొడుస్తున్న పొద్దు అస్తమించింది. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్ పార్థివ దేహానికి పలువురు నాయకులు, ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు.. గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.