ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువయ్యాయి: కాంగ్రెస్ లో జగ్గారెడ్డి లేఖ కలకలం

First Published Apr 27, 2023, 12:07 PM IST

సంగారెడ్డి  ఎమ్మెల్యే  జగ్గారెడ్డ  మరోసారి   నోరు విప్పారు.  ఆవేదన పేరుతో  జగ్గారెడ్డి  లేఖ  విడుదల  చేశారు. 

జగ్గారెడ్డి

గాంధీభవన్ లో  ప్రెండ్లీ పాలిటిక్స్  కరువయ్యాయని   సంగారెడ్డి  ఎమ్మెల్యే  జగ్గారెడ్డి   ఆరోపించారు. గురువారంనాడు    జగ్గారెడ్డి  ఆవేదన  పేరుతో   లేఖను  విడుదల  చేశారు.  ఆవేదన పేరుతో జగ్గారెడ్డి  వరుసగా  లేఖలను వడుదల  చేయడం  ప్రస్తుతం  కాంగ్రెస్ పార్టీలో  చర్చకు కారణమైంది.  

జగ్గారెడ్డి

గతంలో  ఉన్నట్టు ఇప్పుడు లేదన్నారు. తాను ను ఎవరి పేర్లు చెప్పదల్చుకోలేదని  జగ్గారెడ్డి  చెప్పారు.  కార్యకర్తలు,అభిమానులకు  తెలియాలనేది తన ఆవేదనగా  ఆయన   ఆ లేఖలో పేర్కొన్నారు. గాంధీ భవన్ లో  ప్రశాంతత  కరువైందన్నారు. 

Latest Videos


జగ్గారెడ్డి

దాదాపు  ఐదు మాసాలుగా   జగ్గారెడ్డి  గాంధీ భవన్ కు దూరంగా  ఉన్నారు.   గతంలో  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  తీరుపై జగ్గారెడ్డి  ఒంటికాలిపై  విమర్శలు  చేశారు.

జగ్గారెడ్డి

ఆ తర్వాత  ఈ విమర్శలను  కొంత  కాలంగా  నిలిపివేశారు..నియోజకవర్గంపైనే  జగ్గారెడ్డి  కేంద్రీకరించారు. హైద్రాబాద్ సీఎల్పీ  కార్యాలయానికి వస్తున్నా కూడా  వివాదాస్పద విషయాలపై  జగ్గారెడ్డి  నోరు మెదపలేదు. పార్టీ అంతర్గత అంశాలపై  కూడా  ఆయన మాట్లాడలేదు. 

జగ్గారెడ్డి

jagga reddyకానీ  ఆకస్మాత్తుగా  జగ్గారెడ్డి  లేఖలు  విడుదల  చేయడం  ప్రస్తుతం  కలకలం  రేపుతుంది. తెలంగాణ కాంగ్రెస్  సీనియర్లకు ,టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య  గ్యాప్ ఉంది.  మాజీ పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డికి జగ్గారెడ్డి  అత్యంత  సన్నిహితుడుగా  పేరుంది.  

జగ్గారెడ్డి

 ఆవేదన  పేరుతో  జగ్గారెడ్డి  లేఖల విడుదల  వెనుక వ్యూహం ఏముందనే విషయమై   పార్టీ వర్గాల్లో  చర్చ సాగుతుంది.   తెలంగాణ రాష్ట్రంలో  ఈ ఏడాది చివర్లో  ఎన్నికలు  జరగనున్నాయి. 

జగ్గారెడ్డి

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీని  తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని  ఆ పార్టీ నాయకత్వం  పట్టుదలతో  ఉంది. అయితే  పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం  ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. 

జగ్గారెడ్డి

పార్టీ అంతర్గత  అంశాలపై  పార్టీ  వేదికలపైనే చర్చించాలని   పార్టీ సీనియర్ నేత  దిగ్విజయ్ సింగ్  తెలంగాణ నేతలకు  సూచించారు.  మీడియా వద్ద  ఈ అంశాలపై  మాట్లాడితే  చర్యలు తీసుకొంటామని  కూడా ఆయన వార్నింగ్  ఇచ్చారు. పార్టీ వేదికలపై  కాకుండా   బయట మాట్లాడితే  పార్టీకి నస్టమని  ఆయన  తేల్చి చెప్పారు.  జగ్గారెడ్డి  ఈ లేఖలు  విడుదల చేయడంపై  పార్టీ నాయకత్వం  ఎలా స్పందిస్తుందో  చూడాలి .

click me!