మహమూద్ అలీ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

Published : Apr 22, 2023, 05:22 PM IST

రంజాన్ పర్వదినం సందర్బంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ నివాసానికి వెళ్లారు. మహమూద్ అలీ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.

PREV
15
మహమూద్ అలీ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ నివాసానికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌కు మహమూద్ అలీ స్వాగతం పలికారు. 

25

మహమూద్ అలీ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకంక్షలు తెలియజేశారు. అక్కడే భోజనం కూడా చేశారు. 

35

సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు కే కేశవరావు, సంతోష్ కుమార్, మంత్రులు కొప్పుల ఈశ్వర్ సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు కూడా మహమూద్ అలీ నివాసానికి వెళ్లి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. 

45

ఇక, తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. పలు జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంజాన్ వేడుక‌ల్లో పాల్గొని ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్ని మతాల అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉంద‌ని మంత్రులు స్ప‌ష్టం చేశారు.
 

55

ఇదిలా ఉంటే.. ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం ద్వారా క్రమశిక్షణ, భక్తి, సోదర భావం స్పూర్తితో ముస్లింలు కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఈద్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సర్వశక్తిమంతుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, అన్ని మతాల ప్రజలు సంతోషంగా, సామరస్యపూర్వకంగా జీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

click me!

Recommended Stories