సీం కాలేనని బాధతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు బసవేశ్వరుడి విగ్రహానికి బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఖాయమని తెలిసి పీసీసీ పదవి నుండి తప్పిస్తారనే బాధతోనే కన్నీళ్లు పెట్టుకున్నారేమోనని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. .