మారుబెనీ కంపెనీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా ఎదుగుతున్న ప్రాంతం. ఇక్కడి అవకాశాలను వినియోగించుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చూపిన దార్శనికత అభినందనీయం” అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాల్లో వ్యాపార విస్తరణ కలిగిన మారుబెనీ, 410 గ్రూప్ కంపెనీలు, 50,000 మందికి పైగా ఉద్యోగులతో అనేక రంగాల్లో సేవలందిస్తోంది. ముఖ్యంగా ఫుడ్, మైనింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, మౌలిక వసతులు, ఏరోస్పేస్ రంగాల్లో ఈ సంస్థ ప్రముఖంగా పనిచేస్తోంది.
కాగా సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. సోని కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, వీఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ఇందుకు సోనీ గ్రూప్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.