Rains Alert : తెలుగు ప్రజలు బిఅలర్ట్ .. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Published : May 27, 2025, 08:49 AM ISTUpdated : May 27, 2025, 08:54 AM IST

తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీాంతో ఇకపై భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఆ జిల్లాలేవంటే… 

PREV
15
తెలుగు రాష్ట్రాలను తాకిన రుతుపవనాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో ద్రోణి కారణంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాలను తాకడంతో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

25
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఇప్పటికే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ(మంగళవారం) అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇలా వర్షసూచనలు గల పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసారు.

35
ఈ జాగ్రత్తలు పాటించండి

ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది. అవసరం ఉంటేనే వ్యవసాయ పనులకు వెళ్లాలని రైతులు, కూలీలకు సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద అస్సలు ఉండకూడదని సూచించారు. 

45
ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఇక రేపు (మే 28, బుధవారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక మే 29న ఆదిలాబాద్ లో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలుండటంతో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

55
ఏపీలో వర్షాలే వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని... దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వర్షాలు నేడు చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. సోమవారం అత్యధికంగా అల్లూరి జిల్లా రాచపనుకులులో 56 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories