పోతిరెడ్డిపాడుపై వివాదాస్పద జీవోలు: నాడు వైఎస్ఆర్, నేడు జగన్

First Published May 13, 2020, 12:16 PM IST

పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కార్ జారీ చేసిన 203 జీవో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాయి. ఈ జీవోను రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తొంది. తెలంగాణలోని విపక్షాలు కూడ ఇదే విషయమై ఏపీ సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంపు అంశం చిచ్చు పెట్టింది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచాలనే ప్రతిపాదనను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకొంటుంది. ఈ ప్రతిపాదనను తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
undefined
తెలంగాణకు చెందిన పలు పార్టీలు కూడ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడ ఇదే రకమైన జీవోను జారీ చేశారు. అప్పట్లో ఆ జీవోపై టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన హైద్రాబాద్ బ్రదర్స్ గా పేరొందిన మర్రి శశిధర్ రెడ్డి, పీజేఆర్ లు తీవ్రంగా వ్యతిరేకించారు.
undefined
శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమకు నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటరీని ఏర్పాటు చేశారు. దీంతో దీన్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీగా పిలుస్తారు. పోతిరెడ్డి పాడు గ్రామం నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో ఉంది. శ్రీశైలం ఒడ్డునే ఈ గ్రామం ఉంది.దీంతో హెడ్ రెగ్యులేటరీని ఈ గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.
undefined
శ్రీశైలం నుండి 11500 క్యూసెక్కులను ప్రవాహ సామర్ధ్యంతో నాలుగు తూములను అప్పట్లో ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలుగు గంగ ద్వారా చెన్నైకి తాగు నీటి అవసరాలకు ఇవ్వాల్సిన నీరు కూడ ఇదే మార్గంలో వెళ్తోంది.
undefined
శ్రీశైలం జలాశయం నుండి శ్రీశైలం కుడి కాలువ ప్రధాన కాలువలోకి వెళ్తోంది. ఈ కాలువ 16.4 కి.మీ ప్రయాణం చేసి బనకచర్ల క్రాస్ వద్ద రెగ్యులేటరర్ వద్ద ముగుస్తోంది.ఇక్కడ ఉన్న మూడు రెగ్యులేటర్ల ద్వారా మూడు మార్గాల్లో కృష్ణా నీరు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా ప్లాన్ చేశారు.
undefined
కడప, కర్నూల్ జిల్లాలకు శ్రీశైలం కుడి కాలువ (ఎస్ఆర్‌బీసీ) ద్వారా నీరు అందిస్తారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి తాగు నీటిని సరఫరా చేస్తారు. గాలేరు నగరి ద్వారా అధికంగా వచ్చే వరద నీటిని మళ్లించేందుకు ప్రతిపాదించారు.
undefined
శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఎడమ వైపు నుండి ప్రస్తుతం మరో సొరంగం పనులు సాగుతున్నాయి. దీన్ని శ్రీశైలం ఎడమగట్టు కాలువగా పిలుస్తారు. ఈ పనులు ఇంకా సాగుతున్నాయి.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2005 సెప్టెంబర్ 13న 170 జీవో జారీ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచడమే ఈ జీవో ఉద్దేశ్యం. 11,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యాన్ని 40వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ జీవోను ఆనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ తీవ్రంగా వ్యతిరేకించారు.
undefined
తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలంకుడిగట్టు కాలువకు అవసరమైన 102 టీఎంసీ నీటిని వరద వచ్చిన సమయంలో 30 రోజుల్లో తరలించడమే ఈ జీవో ఉద్దేశ్యమని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే 40 వేల క్యూసెక్కులు వెళ్తాయి. కనీస నీటిమట్టం 854 అడుగులు ఉన్నప్పుడు మూడువేల క్యూసెక్కులు మాత్రమే వెళ్తాయని అప్పటి ప్రభుత్వం వాదన. 30 రోజుల్లోనే తమకు కేటాయించిన వాటాను వాడుకొనేందుకు గాను పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచినట్టుగా ఆనాడు ప్రభుత్వం వాదించింది.
undefined
అయితే ఇదే సమయంలో కృష్ణా జలాలపై హక్కులేని ప్రాంతాలకు నీటిని తరలించడాన్ని నీటి రంగ నిపుణులు తప్పుబట్టారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచడంతో తెలంగాణలోని నల్గొండ, మహాబూబ్ నగర్ జిల్లాలు ఎడారిగా మారే అవకాశం ఉందని ఆనాడు టీఆర్ఎస్ విమర్శలు చేసింది.హైద్రాబాద్ బ్రదర్స్ పీజేఆర్, మర్రిశశిధర్ రెడ్డిలు ఈజీవోను వ్యతిరేకించారు.
undefined
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా 2004 జూన్ రెండున విడిపోయింది. పోతిరెడ్డిపాడు వివాదం మరోసారి ప్రస్తుతం తెరమీదికి వచ్చింది. ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ 203 జీవోను ఈ నెల 5న జారీ చేసింది. పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచడమే ఈ జీవో ఉద్దేశ్యం.
undefined
వరద నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోతే శ్రీశైలం ప్రాజెక్టు నిండే పరిస్థితి ఉండదు. అదే జరిగితే దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కృష్ణా వాటర్ రాదు. సాగర్ ప్రాజెక్టుకు నీరు రాకపోతే నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు జంటనగరాలకు తాగు నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
undefined
నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కూడ నీరు లేని పరిస్థితి నెలకొంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.ఇదే విషయమై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది.
undefined
click me!