కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. ‘అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’

Published : Nov 27, 2021, 05:30 PM IST

ఎమ్మెల్సీ కవిత శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టులో పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కొండగట్టు అద్భుత ప్రాంతమని అన్నారు. ఇక్కడ మరిన్ని నిర్మాణాలు చేపట్టడానికి, అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యాక ఆమె తొలిసారి కొండగట్టు పర్యటించారు.  

PREV
16
కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. ‘అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’
MLC Kavita

ఎమ్మెల్సీ కవిత శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఆంజనేయస్వామికి పూజలు చేశారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారిగా కొండగట్టు అంజన్నను  దర్శించుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడారు. ఎన్ని సార్లు దర్శించుకున్నా మళ్లీ మళ్లీ రావాలనిపించే అద్భుత ప్రాంతం కొండగట్టు అని తెలిపారు. కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం తన అదృష్టమని చెప్పారు. కొండగట్టుకు రావడం సంతోషంగా ఉన్నదని వివరించారు. అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు.
 

26
MLC Kavita

ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. కరోనా సమయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం యాగం నిర్వహించామని గుర్తు చేశారు. ఏ కొండ ఎక్కినా, ఏ బండ మొక్కినా రాష్ట్రం కోసమే అని అన్నారు.

36
MLC Kavita

దేశంలో నెంబర్‌ వన్‌గా తెలంగాణ ఉండాలని యాగాలను నిర్వహించినట్టు తెలిపారు. కొండగట్టులో అద్భుత నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. రామకోటి రాసి సమర్పించే వారికి రామకోటి స్థూప నిర్మాణం జరుగుతున్నదని, ఇంకా అనేక ఇతర వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వివరించారు.

46
MLC Kavita

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ పార్టీలకు స్థానిక సంస్థల్లో బలం లేదని, కాబట్టి ఆయా పార్టీ ప్రజా ప్రతినిధులూ టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

56
MLC Kavita

ఇదిలా ఉండగా, నిజామాబాద్  జిల్లా local body quota ఎమ్మెల్సీ ఎన్నికల్లో trs అభ్యర్ధి kalvakuntla kavitha  నవంబర్ 24న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

66
MLC Kavita

స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీనివాస్ వేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ స్థానానికి రెండే నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది.

Read more Photos on
click me!

Recommended Stories