కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. ‘అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’
First Published Nov 27, 2021, 5:30 PM ISTఎమ్మెల్సీ కవిత శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టులో పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కొండగట్టు అద్భుత ప్రాంతమని అన్నారు. ఇక్కడ మరిన్ని నిర్మాణాలు చేపట్టడానికి, అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యాక ఆమె తొలిసారి కొండగట్టు పర్యటించారు.