సీఎం సతీమణి, కూతురు రాకతో దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. అమ్మవారి ఆలయం వద్దకు భారీఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని స్వాగతం పలికారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.