గతంలోనూ పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ అమిత్ షాతో భేటీ కాలేదు. కేటీఆర్ చివరిసారిగా 2022 జూన్లో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం.. అక్కడ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, హర్దీప్ సింగ్ పూరీలతో సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది.