‘ఇంటింటికి బీజేపీ’ కార్యక్రమానికి ఈటెల, కోమటిరెడ్డి రాజగోపాల్ దూరం.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే...

First Published Jun 22, 2023, 11:49 AM IST

తెలంగాణలో బీజేపీ చేపట్టిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి ఇద్దరు కీలక నేతలు దూరంగా ఉన్నారు. దీనిమీద అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.  

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమయ్యింది. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్లు దూరంగా ఉండడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. 

బీజేపీ సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వారు ఇంట్లోనుంచి బైటికి రాలేదు. 

Latest Videos


దీనిమీద తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీవరకు సమయం ఉంది. ఎవరికి కుదిరినప్పుడు వారు పాల్గొంటారని అన్నారు. కొందరు నేతలు ఫోన్ చేసి కుదరడం లేదని చెప్పారని.. ఈ రోజు కాకపోతే రేపు జాయిన్ అవుతారని అన్నారు.

‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో ప్రతీరోజు రోజుకు 100 కుటుంబాలను దర్శించుకోవాలని టార్గెట్ అన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అయితే, 
ముఖ్యనేతలు ఎవ్వరూ రావడం లేదన్నది సరికాదన్నారని..దీన్ని రాజకీయం చేయద్దని తెలిపారు. 

అయితే, గత కొంతకాలంగా బీజేపీలో ఈటెల రాజేందర్, రాజగోపాల్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిద్దరూ ఇళ్లనుంచి బైటికి రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

click me!