మహిళలు కన్నెర్రజేస్తున్నారు... ఇక మోదీ సర్కార్ కు మూడినట్లే...: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Mar 24, 2022, 04:38 PM IST

గ్యాస్ సిలిండర్, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రంపై ఫైర్ అయ్యారు.

PREV
17
మహిళలు కన్నెర్రజేస్తున్నారు... ఇక మోదీ సర్కార్ కు మూడినట్లే...: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

సూర్యాపేట: టీఆర్ఎస్ పార్టీ పిలుపుతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఇవాళ(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు కూడా టీఆర్ఎస్ నిరసనల్లో పాల్గొన్నారు. ఇలా మంత్రి జగదీష్ రెడ్డి ఇలాకా సూర్యాపేటలో కూడా మహిళలు గ్యాస్ సిలిండర్ తో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి శంకర్ విలాస్, యంజి రోడ్, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మహిళలు దగ్దం చేశారు.

27

అంతకుముందు వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్లకార్డుల ప్రదర్శిస్తూ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళలు నిరసన చేపట్టారు. రోడ్డుపైనే ఖాళీ సిలిండర్లు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంటావార్పు చేపడుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో  విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 
 

37

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశాన్ని పాలిస్తున్న మోడీ సర్కార్ కేవలం పెట్టుబడిదారుల కొమ్ము కాసేందుకే పరిమితమయ్యిందని ఆరోపించారు. పెరిగిన వంట గ్యాస్ తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకేనంటూ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 
 

47

మహిళలు కన్నెర్ర చేస్తే ఎన్నో ప్రభుత్వాలు మట్టికొట్టుకుపోయాయని మంత్రి దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ప్రజల జేబులను నింపుతుంటే అవే జేబులకు మోడీ ప్రభుత్వం చిల్లులు పెడుతుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
 

57

 ఆసరా ఫించన్ కింద వృద్దులకు 2000 రూపాయలు, దివ్యాంగులకు రూ.3000, రైతుబందు పేరుతో ఒక్కో రైతుకు సాలీన ఎకరాకు 10,000 రూపాయల వ్యవసాయ పెట్టుబడులు అందిస్తుంటే బిజెపి పాలకులు మాత్రం వంట గ్యాస్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. 

67

పేదింటి ఆడపడుచుల పెళ్లికి సర్కార్ కట్నంగా కళ్యాణలక్ష్మి/షాది ముబారక్ పథకం కింద లక్షా నూట పదహారు రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా డెలివరీ ఆయిన మహిళలకు 12,000/13,000 అందిస్తూ పేదలను కాపాడుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వంట గ్యాస్, డీజిల్ ధరలను పెంచి వారి పొట్ట కొడుతోందని జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇలాంటి మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మంత్రి మండిపడ్డారు. 

77

పెరిగిన ధరలకు నిరసనగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన కొద్దీ సమయంలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మోడీ సర్కార్ పై మరో పోరుకు ఇన్ని వేల మంది సమాయత్తం కావడం మహిళలలో వెళ్లివిరిసిన చైతన్యానికి నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 
 

click me!

Recommended Stories