కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి నమ్మదని హరీష్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ఇలాంటి పార్టీల డిక్లరేషన్లు ప్రజలను ప్రభావితం చేయలేవని... మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని, బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని హరీష్ అన్నారు.