కాళేశ్వరం పనుల్లో అలసత్వం... అధికారులపై మంత్రి హరీష్ సీరియస్

First Published May 15, 2020, 1:53 PM IST

దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు. 

సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం పరిశీలించారు. తొగుట మండలం తుక్కాపూర్ సమీపంలో ప్యాకేజీ-12 లో భాగంగా జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా వుండటంతో ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.
undefined
దుబ్బాకకుమల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను ఆర్థిక మంత్రి పరిశీలించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు మంత్రితో కలిసి కాలువను పరిశీలించారు.
undefined
దాదాపు 40 కిలో మీటర్ల దూరం నిర్మిస్తున్న ఈ ప్రధాన కాలువ వెంట మంత్రి హరీశ్ పర్యటించారు. ఈ సందర్భంగా పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి నీటిపారుదల అధికారులకు ఆర్థికమంత్రి సూచించారు.
undefined
click me!