నాడు సమ్మె, నేడు లాక్‌డౌన్‌తో 55 రోజులుగా నిలిచిన బస్సులు: తెలంగాణ ఆర్టీసీపై దెబ్బ మీద దెబ్బ

First Published May 14, 2020, 12:43 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గత ఏడాది సమ్మె కారణంగా 55 రోజుల పాటు బస్సులు నిలిచిపోయాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఇవాళ్టికి 55 రోజుల పాటు బస్సులు రోడ్లపై నిలిచిపోయాయి.

నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి లాక్ డౌన్ మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. తమ డిమాండ్ల సాధన కోసం గత ఏడాదిలో సుమారు 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు. ఆ తర్వాత విధుల్లో చేరారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో 54 రోజులుగా ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఈ నెల 15వ తేదీన అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
undefined
అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా రూపంలో మరో దెబ్బ తగిలింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. బస్సులను నడపడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
undefined
ఈ ఏడాది మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. మార్చి 23వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 29వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
తమ డిమాండ్ల సాధన కోసం 2019 అక్టోబర్ 4వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఆర్టీసీలో ప్రధాన యూనియన్లు జేఎసీగా ఏర్పడి సమ్మెకు దిగాయి. ఈ సమ్మెపై ప్రభుత్వం కూడ అదే స్థాయిలో స్పందించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వం ప్రకటించింది. కోర్టులో కూడ కేసులు నడిచాయి.
undefined
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణలోని విపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఆర్టీసీలోని 49,860 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. చివరకు ఆర్టీసీ జేఎసీ నవంబర్ 25వ తేదీన సమ్మెను విరమిస్తున్నట్టుగా ప్రకటించింది. సమ్మె విరమిస్తున్నట్టుగా జేఎసీ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.
undefined
నవంబర్ 28వ తేదీన సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత కార్మికులు భేషరతుగా విధుల్లో చేరాలని కోరారు. దీంతో నవంబర్ 29వ తేదీన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. 55 రోజుల సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ప్రతి ఆర్టీసీ బస్సు డిపోల్లో ఐదు బస్సులను స్పేర్ లో రెడీగా ఉంచింది. కానీ బస్సులు మాత్రం ప్రయాణీకులను తరలించడం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో బస్సుల రాకపోకలు నిలిచిపోయి ఇవాళ్టికి 54 రోజులకు చేరుకొంది.
undefined
గత ఏడాది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయం కూడ కీలకమైంది. దసరా పర్వదినం సమయంలో ఆర్టీసీకి పెద్ద ఎత్తున రెవిన్యూ వచ్చేది. ఆ సమయంలో సమ్మె కారణంగా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ భారీగా రెవిన్యూను కోల్పోయింది.
undefined
ప్రస్తుతం వేసవి సెలవులు. ఈ సమయం కూడ ఆర్టీసీకి భారీగా రెవిన్యూ వచ్చే కాలంగా అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో కూడ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కూడ ఆర్టీసి ఆదాయాన్ని భారీగా దెబ్బతీసింది.
undefined
ఈ నెల 15వ తేదీన అధికారులతో నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మరో వైపు బస్సుల్లో ప్రయాణీకులను అనుమతి ఇచ్చే విషయంలో కూడ జాగ్రత్తలు తీసుకోనున్నారు.
undefined
click me!