శుక్రవారం ఢిల్లీలో మాణిక్ రావు ఠాక్రే, రోహిత్ చౌదరి ఇద్దరూ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వెళ్లిన నేతలు.. అక్కడ ఉండలేక పోతున్నారని తెలిపారు. తిరిగి కాంగ్రెస్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనితోపాటు త్వరలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి కూడా కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు.
ఈ చేరికల తర్వాత టిఆర్ఎస్, బిజెపిల నుంచి కాంగ్రెస్లోకి నేతలు పెద్ద ఎత్తున చేరుతారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగిపోయాయన్నారు. అంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయం ఎలా సొంతమవుతుందో తెలియడంతో, ఆ మేరకు ముందుకు పోతున్నారని తెలిపారు,