గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయం కోసం కేసీఆర్ పక్కా ప్లాన్, విపక్షాలకు చెక్

First Published Mar 11, 2021, 11:02 AM IST

తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతి రోజూ ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. 

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు ఆకర్షించేందుకు వరాలు కురిపిస్తున్నారు.
undefined
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
undefined
నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుండి టీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తోంది. హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తోంది.
undefined
హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి ఇప్పటివరకు టీఆర్ఎస్ విజయం సాధించలేదు. దీంతో ఈ దఫా మాత్రం ఈ స్థానంతో పాటు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
undefined
పోలింగ్ కు మూడు రోజుల ముందు తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైంది. పీఆర్సీ తో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం నాడు ప్రకటించారు.
undefined
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ఫిట్‌మెంట్ తో పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయస్సు పెంచనున్నారు. అంతేకాదు ప్రమోషన్ల విషయంలో కూడ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
undefined
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వీటిని అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం హామీ ఇచ్చారని సంఘ నేతలు చెప్పారు.
undefined
మరోవైపు సుమారు 50 వేల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. నిరుద్యోగుల ఓట్లను తమ వైపునకు మళ్లించుకొనేందుకు గాను రిక్రూట్ మెంట్ ప్రక్రియను చేపట్టనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
undefined
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడుగా వెళ్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు.ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో విద్యార్ధులు, ఉద్యోగుల కోసం కొత్త విధానాలను అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.
undefined
మండలస్థాయిలోని ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులకు ఓటు చేయాలని కోరుతున్నారు.
undefined
ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయం తీసుకొంటే ఈ ఏడాది మార్చి 31 నాటి నుండి సుమారు 10 వేల మంది ఉద్యోగులు తమ విధులను కొనసాగించే అవకాశం దక్కుతోంది. లేకపోతే ఈ 10 వేల మంది ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుంది.
undefined
గత ఎన్నికల్లో హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ ను బరిలోకి దింపినా కూడ టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో విజయం సాధించలేదు. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
undefined
మరో వైపు ఏపీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని సీఎం హమీ ఇచ్చారు.
undefined
click me!