నాగార్జునసాగర్ బైపోల్: లోకల్‌ నేతల వైపే కేసీఆర్ మొగ్గు, ఆ సామాజికవర్గానికే సీటు?

First Published Mar 6, 2021, 7:39 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. 

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్థానిక అభ్యర్ధిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.ఈ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ నేతలతో ఆయన అభ్యర్ధుల గురించి ఆరా తీస్తున్నారు.
undefined
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న యాదవ సామాజికవర్గం నేతకు టిక్కెట్టు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.
undefined
గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి పనిచేయని కారణంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.
undefined
మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ కు ఈ స్థానం నుండి టిక్కెట్టు ఇచ్చే విషయమై టీఆర్ఎస్ నాయకత్వం నుండి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదనే ప్రచారం సాగుతోంది.
undefined
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన నోముల నరసింహయ్య నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి 2018 ఎన్నికల్లో విజయం సాధించాడు.2014 ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
undefined
ఈ నియోజకవర్గంలోని ముగ్గురు యాదవ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారని సమాచారం.త్రిపురారం మండలానికి చెందిన పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్, కట్టెబోయిన గురవయ్య యాదవ్ ల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తుందని ప్రచారం సాగుతోంది.
undefined
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సమీప బంధువు గురవయ్య పేరును కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే గురవయ్య పేరును ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
గత ఏడాది డిసెంబర్ మాసంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతకు టీఆర్ఎస్ సీటిచ్చింది. అయితే ఈ స్థానం నుండి టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ విజయం సాధించింది.
undefined
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీఆర్ జాగ్రత్త తీసుకొంటున్నారు.
undefined
కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా జానారెడ్డిని ఈ స్థానం నుండి బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి జానారెడ్డి ఓటమి పాలయ్యాడు.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ చీప్ కేసీఆర్ పలు ప్రైవేట్ సంస్థలతో సర్వే నిర్వహించాడు. అయితే ఈ సర్వేల్లో స్థానికంగా ఉన్న యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్టు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది.
undefined
అపారమైన రాజకీయ జీవితంతో పాటు పేదలకు అనుకూలమైన వైఖరితో ఉంటే నరసింహయ్యను 2018లో ఈ స్థానం నుండి గెలిపించినట్టుగా సర్వే రిపోర్టులు చెప్పినట్టుగా తెలుస్తోంది.
undefined
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కూడ ఈ స్థానం నుండి టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే యాదవ సామాజికవర్గం వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.
undefined
click me!