TRS Party… ఈ పేరు కోసం కల్వకుంట్ల కుటుంబం రాజకీయ రచ్చకెక్కింది. ఈ పేరుతో కవిత కొత్తపార్టీ పెట్టగా… కేసీఆర్ ఊహించని రియాక్షన్ ఇచ్చారు. ఇంతకు టీఆర్ఎస్ కూతురిదా… కొడుకుదా..? కేసీఆర్ సపోర్ట్ ఎవరికి..?
TRS Party : తెలంగాణ రాజకీయాలు కల్వకుంట్ల కుటుంబంలో అగ్గి రాజేశాయి… ఇంకా చెప్పాలంటే పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టాయి. తండ్రి కూతురుని, అన్నా చెల్లిని వేరు చేశాయనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం ఆయన బిడ్డలు కేటీఆర్, కవిత పోటీ పడుతున్నారు... ఈ క్రమంలో ఒకే కడుపున పుట్టిన ఈ అన్నాచెల్లి రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఆసక్తికర విషయం ఏంటంటే కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇటీవల బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మారింది... ఈ BRS కేటీఆర్ కు దక్కింది. దీంతో తండ్రి మొదట స్థాపించిన TRS పేరు కలిసివచ్చేలా కవిత కొత్త పార్టీ పెట్టుకుంది... అదే తెలంగాణ రా ష్ట్ర సేన.
ఇవాళ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించింది... అయితే పార్టీపేరు 'TRS' అని కలిసివచ్చేలా పెట్టడంపై బిఆర్ఎస్ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. బిఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో కవిత పార్టీపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అధికారక ఖాతాలో పోస్ట్ కాబట్టి ఇది ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రియాక్షన్ గానే పరిగణించాలి. ఇంతకూ ఈ ఎక్స్ పోస్ట్ లో ఏముందో తెలుసా...?
24
''ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!''
కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' పార్టీ నకిలీది... 'తెలంగాణ రాష్ట్ర సమితి'' యే అసలైన టీఆర్ఎస్ అనేలా బిఆర్ఎస్ పోస్ట్ ఉంది. ఇందుకు ఉదాహరణగా ఒరిజినల్ కోల్ గేట్ టూత్ పేస్ట్, బిస్లెరి వాటర్ బాటిల్ ఫోటోలకు పక్కనే వాటిని అచ్చుగుద్దినట్లు ఉండే నకిలీ వాటి పోటీలను పెట్టారు. దీనికి ''ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!'' అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ఒరిజినల్ TRS తమదే... కవితది నకిలీ టీఆర్ఎస్ అంటోంది బిఆర్ఎస్.
34
''కేసీఆర్ మన మనిషి కాదు... మర మనిషి''
తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత సొంత తండ్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగాయి. ఆయనపై గౌరవం ఉందంటూనే చేయాల్సిన విమర్శలు చేశారు. కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారని... రాష్ట్రంలో పీకి కట్టలు కట్టామన్నట్లు టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని విమర్శించారు. ఇలా డైరెక్ట్ గా కేసీఆర్ నే టార్గెట్ చేసి కవిత ప్రసంగం సాగింది.
''ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు
హైడ్రాలో ఇళ్లు కూలిపోతుంటే అన్నా ఎక్కడున్నావ్ రా... అంటే వచ్చిండ్రా..
కొత్త పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రజలకు ఎమోషనల్ టచ్ ఇచ్చేలా మాట్లాడారు. ఈ రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మందికి అమ్మలా పరిణితి చెందాలనుకుంటున్నానని అన్నారు. అమ్మతనంతో పరిపాలన జరగాలి... అమ్మలా పాలిస్తా, బిడ్డలను బాగా చూసుకుంటానని అన్నారు. మన ప్రభుత్వం... మీ అమ్మ ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్నారు. ''అమ్మ జేబు చూడదు.. కడుపు చూస్తది'' అంటూ ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా మాట్లాడారు.
ఇక TRS పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. ''రూపాయి ఖర్చు లేకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఉచిత విద్య పొందుతారు. కేవలం ప్రభుత్వ విద్య కాదు ప్రైవేట్ విద్య కూడా భారం కాకుండా చూస్తా.. డాక్టర్లు, ఇంజనీర్లు కాదు రాకెట్ సైన్సులు చదివే తెలంగాణ బిడ్డలకు రూపాయి ఖర్చు లేకుండా చూస్తా... పేద, మధ్యతరగతి వారిపై ఇక చదువుల భారం ఉండదు. మీరు ఎంత చదువుకున్నా సరే తెలంగాణ రాష్ట్ర సేన చూసుకుంటుంది... మీ అమ్మ ప్రభుత్వమే మిమ్మల్ని చదివిస్తుంది..'' అని కవిత హామీ ఇచ్చారు.