ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడిలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, చినజీయర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి బుధవారం తెలిపారు. ఇక, చినజీయర్, కేసీఆర్ ఒకే వేదిక మీదకు వస్తుండటంతో.. ఇద్దరి మధ్య ప్యాచప్ జరిగిందనే ప్రచారం తెరమీదకు వచ్చింది.