Disha Encounter Case : దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ కి రెండేళ్లు పూర్తి....

First Published Dec 6, 2021, 10:59 AM IST

 2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున దిశను హతమార్చిన నలుగురిని సీనరీ కన్స్ట్రక్షన్ కోసం chatanpally బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల పైకి తిరగడంతో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్,  చెన్నకేశవులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. 

disha encounter case

షాద్ నగర్ : నవంబర్ 27, 2019 రాత్రి.. అందరికీ అన్ని రోజుల్లాగే మామూలుగానే గడిచిపోయింది. కానీ దిశ విషయంలో ఇది కాళరాత్రిగా మారింది. నలుగురు మృగాళ్లు పక్కా ప్లాన్ తో వెంటాడి, వేటాడి.. పాశవికంగా అత్యాచారం చేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. 

నవంబర్ 28, 2019 ఉదయం.. ఈ ఘటన తెల్లవారి వెలుగుతో పాటే బయటి ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఇదొక సంచలనంగా మారింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఆ పాశవిక దారుణ కాండతో ఉలిక్కి పడ్డారు. ఆ దారుణం మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది. కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి దిశను Assassination చేసింది నలుగురు యువకులని తేలింది.

దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. dishaను న్యాయం చేయాలంటూ ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. నవంబర్ 29 న.. Veterinary Doctor దిశ కేసులో సైబరాబాద్ పోలీసులు నిందితులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ లు గుర్తించారు. నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తారని గుర్తించారు.

ఆ తరువాత డిసెంబర్ 6, 2019 అందరికీ మామూలుగానే తెల్లారింది. కానీ దిశ నిందితుల జీవితాలు మాత్రం తెల్లారిపోయాయి. Encounter లో నలుగురు మృతి చెందారు.  డిసెంబర్ 6, 2019 శుక్రవారం పోలీసులు నిందితులను Sean Reconstruction కోసం తీసుకువెళ్లారు. దిశను వాళ్లు Cremation చేసింది.. దాదాపు 3గంటల ప్రాంతంలో కావడంతో.. అదే సమయంలో నిందితులను అక్కడకు తీసుకువెళ్లారు. అక్కడ నిందితులు పోలీసుల వద్ద నుంచి తుపాకీలు లాక్కోవడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా రాళ్లదాడి కూడా చేశారు. ఈ క్రమంలో...పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా.. నిందితులపై కాల్పులు జరిపారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన జరిగి నేటికి రెండేళ్ళు పూర్తి అయింది.

ఈ కేసులో ఎన్నో మలుపులు..
దిశ హత్య తర్వాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. హత్య చేసిన నిందితులను పోలీసులు 2019 నవంబర్ 29న షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకు రావడంతో అక్కడి వారిని ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం.. పోలీసుల  పైకి రాళ్లు రువ్వడం..  చెప్పులు విసరడం లాఠీఛార్జి చేయడం తెలిసిందే.

disha encounter case

ఆ తర్వాత నిందితులను పోలీసులు Chatan Palli జైలుకు తరలించారు.  2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున దిశను హతమార్చిన నలుగురిని సీనరీ కన్స్ట్రక్షన్ కోసం chatanpally బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల పైకి తిరగడంతో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్,  చెన్నకేశవులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. 

ప్రజా సంఘాల ఆందోళన..
ఈ ఎన్ కౌంటర్ పై ఆందోళనలు వెల్లువెత్తడంతో.. ఎన్కౌంటర్ ఘటనపై విచారణ కోసం సుప్రీం కోర్టు త్రిసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ సభ్యులు ఎన్ కౌంటర్ ప్రదేశాన్ని, దిశను కాల్చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత షాద్నగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్ ఎదుట ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో  సిర్పూర్కర్ కమిషన్ ప్రజలకు ఏవిధమైన సంకేతాలు ఇస్తోందని.. నిందితుల తరపున విచారణ చేపట్టడం ఏమిటని నిలదీశారు. దీంతో దిశ హత్యోదంతం, ఎన్ కౌంటర్ ఘటన మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

దిశ రేప్, హత్య కేసు: అర్థరాత్రి నలుగురు నిందితుల కాల్చివేత

click me!