Published : Feb 22, 2021, 12:59 PM ISTUpdated : Feb 22, 2021, 01:00 PM IST
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత నేడు(సోమవారం) పదవీ భాద్యతలు స్వీకరించారు. ఉదయం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్ చాంబర్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మేయర్ గా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇలాగే డిప్యూటీ మేయర్ చాంబర్ లో మోతె శ్రీలత భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, పార్లమెంటు సభ్యులు కె. కేశవ రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, శాసన సభ్యులు దానం నాగేందర్, కార్పొరేటర్లు హాజరై మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు.