నాగార్జునసాగర్ బైపోల్: తెరపైకి కొత్త పేర్లు, విజయం కోసం బీజేపీ వ్యూహం

First Published Feb 21, 2021, 1:26 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు చేసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన  ఫలితాలు రావడంతో సాగర్ ఉప ఎన్నికపై బీజేపీ కేంద్రీకరించింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పావులు కదుపుతోంది.రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి.దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కమల దళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
undefined
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లను దెబ్బకొట్టి విజయం సాధించాలని కాషాయ పార్టీ ప్లాన్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.
undefined
ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డిని బరిలోకి దింపింది. ఇదే స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో బీజేపీ బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.అంతేకాదు తాను బీజేపీలో చేరుతానని కూడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు.
undefined
బీజేపీ నేతలు అధికార పార్టీకి చెందిన నేత తేర చిన్నప్పరెడ్డితో మంతనాలు సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ చిన్నప్పరెడ్డిని బరిలోకి దింపే అవకాశాలను కూడ పరిశీలిస్తోంది.
undefined
మరోవైపు 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కె. నివేదిత రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు.ఇదిలా ఉంటే నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ కూడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.
undefined
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడ సాగర్ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకొన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్ గా పార్టీలు భావిస్తున్నాయి.
undefined
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఓడించి విజయం సాధిస్తే రాష్ట్రంలో గులాబీ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకోనేందుకు కొంత వెనుకంజ వేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయని బీజేపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
undefined
ఒకవేళ కాంగ్రెస్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తే టీఆర్ఎస్ కు ధీటుగా బదులిచ్చే పార్టీగా ప్రజలు తమను నమ్ముతున్నారని తేలినట్టేనని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.
undefined
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే సీఎం కేసీఆర్ అమలు కాలేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇటీవలనే హలియా కేంద్రంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పలు హమీలు ఇచ్చారు.
undefined
click me!