అడవిబిడ్డల కోసం అప్పయ్య సాహసం :
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. మరీముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివాసముండే గిరిజన ప్రజలు ఈ వ్యాధుల బారిన ఎక్కువగా పడుతుంటారు. కాబట్టి వర్షాకాలంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది మారుమూల అటవీ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా హైల్త్ క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఇలా ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసారు.