ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్ల రూపాయలను రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు పాలనా పరమైన అంశాలకోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీ ముందుంచారు భట్టి విక్రమార్క.