ఎన్నికల్లో ప్రకటించినట్లు రైతు భరోసా కింద వ్యవసాయం చేసే రైతులకు ఎకరాకు రూ.15వేల చొప్పున అందిస్తామని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రియల్ ఎస్టేట్, సాగులో లేని, వందల ఎకరాలు కలిగిన భూస్వాములకు రైతు భరోసా ఇచ్చి ప్రజాధనం వృదా చేయదల్చుకోలేదని అన్నారు. కాబట్టి రైతు భరోసా అర్హులైన రైతులకే అందిస్తామని...ఇందుకోసం విధివిధానాలను రూపొందించే పనిలో వున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా అర్హులపై నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క వెల్లడించారు.