భారత వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వాయు గుండాల ప్రభావం, ఉపరితల ఆవర్తనాల కారణంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో వచ్చే ఏడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఏడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, యానాం, మహారాష్ట్ర కొంత భాగంలో వర్షాలు పడే అవకాశం ఉంది.