శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పెద్ద చెరువులో నీటిమట్టం పెరిగి మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా రామయ్య బౌలి, శివశక్తి నగర్, బికే రెడ్డి కాలనీ, క్రిస్టియన్ పల్లి, లక్ష్మీ నగర్ కాలనీల్లో ప్రాంతాల్లో వర్షపు నీరు వాగును తలపించేలా ప్రవహించింది. ఈ ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.