రోడ్డు పక్కన మహిళా రైతులతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ముచ్చట్లు.. కలిసి భోజనం చేసి...

First Published Sep 18, 2021, 4:09 PM IST

ఈ సందర్భంగా బాల్కసుమన్ వారి గురించి మాట్లాడుతూ.. మట్టినే దైవంగా కొలుస్తూ.. పైరును ప్రాణంగా భావిస్తూ.. తమ స్వేదంతో నేలను తడుపుతూ.. నేలనుండి సిరులు పండిస్తున్నవారే రైతు బిడ్డలు అన్నారు. వారి ఆప్యాయ గోరుముద్దలు.. అమ్మ ప్రేమను మైమరిపించే ప్రేమానురాగాలు రుచి చూశానని సంతోషం వ్యక్తం చేశారు. 

Balka Suman

వరంగల్ : కమలాపూర్ నుండి కన్నూర్ మార్గంలో మహిళా రైతులతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ముచ్చటించారు. వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు వారితో పాటు కలిసి తిన్నారు. 

Balka Suman

ఈ సందర్భంగా బాల్కసుమన్ వారి గురించి మాట్లాడుతూ.. మట్టినే దైవంగా కొలుస్తూ.. పైరును ప్రాణంగా భావిస్తూ.. తమ స్వేదంతో నేలను తడుపుతూ.. నేలనుండి సిరులు పండిస్తున్నవారే రైతు బిడ్డలు అన్నారు. వారి ఆప్యాయ గోరుముద్దలు.. అమ్మ ప్రేమను మైమరిపించే ప్రేమానురాగాలు రుచి చూశానని సంతోషం వ్యక్తం చేశారు. 

Balka Suman

ఇదిలా ఉండగా.. గతంలో  ఈటల రాజేందర్‌పైనా బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆరెఎస్ పురుడు పోసుకుందని…ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకువచ్చాడని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన లాంటి వాళ్లను కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులను చేశాడని చెప్పారు. మామూలు ఈటెల రాజేందర్ ను తీసుకు వెళ్ళి ఇంట్లో పెద్ద కొడుకు లాగా కేసీఆర్ పెంచుకున్నాడని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా ప్రత్యర్ధికి పని చేసిన వ్యక్తి ఈటెల అని బాల్కసుమన్ ఆరోపించారు

Balka Suman

ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించాడని… పుణె, బెంగుళూర్ లో పార్టీ వ్యతిరేక మీటింగ్ లు పెట్టుకున్నారని సుమన్ ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఫైరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు రేవంత్ ప్రవర్తిస్తున్నాడని సుమన్ ఆరోపించారు. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ రేవంతే అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌ను ఏం చేయాలని సుమన్ ప్రశ్నించారు. 

click me!