ఇలా ఎస్సి, ఎస్టీలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.21,072 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం కేవలం రూ.7638 కోట్లు కేటాయించిందంటూ డిపార్ట్ మెంటల్ వైస్ బడ్జెట్ 2024-25 పేరుతో ఓ పట్టిక సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కానీ నిజానికి బడ్జెట్ లో ఎస్సిల సంక్షేమానికి 33,124 కోట్లు,ఎస్టీల సంక్షేమానికి రూ.17.056 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రకటించారు. దీన్నిబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న బడ్జెట్ లెక్కలు తప్పుగా వున్నట్లు అర్థమవుతోంది.