కనీసం 100 రూపాయిల నోటు మీద నేతాజీ బొమ్మ ముద్రించాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ కి రెండేళ్ల ముందు విదేశాల్లో మన మువ్వన్నెల జెండా ఎగిరిందని... జనగణమణకు మొదటి వెర్షన్ జైహింద్ నినాదం ఇచ్చింది సుభాష్ చంద్ర బోస్ గారేనని పవన్ తెలిపారు. ప్రతిఒక్కరూ మన నేతాజీ కోసం నిలబడాలని అడుగుతున్నా... ఆయన ఆస్తికలు దేశానికి తీసుకురావడంపై మనసు పెట్టండని సూచించారు. పూజా మందిరంలో, గదుల్లో, మసీదుల్లో, హిందూ మందిరాల్లో ఒకటే కోరిక పెడదాం... నేతాజీ అస్తికలు భారత్ కు రావాలని కోరుకుందాం. అదే ఈ సభ ఉద్దేశం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.