భార్య తనను విడిచి వెళ్లిపోవడం, పిల్లలను తన దగ్గరనే వదిలేయడం.. శీనుకు కోపాన్ని తెప్పించింది. భార్య లేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకున్నాడు. ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన వారి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు.
అందులో విషం కలిపి వారికి ఇచ్చాడు. ఆ సంగతి తెలియని ఆ చిన్నారులు ఇద్దరు కూల్ డ్రింకును తాగేశారు. ఆ తర్వాత వీరిద్దరూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఏమనిపించిందో తెలియదు కానీ వెంటనే కూతుర్లిద్దరినీ జనగామ ఆస్పత్రికి తరలించాడు.