తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్: వ్యూహాత్మకంగా కమల దళం అడుగులు

First Published Sep 27, 2020, 5:05 PM IST

తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో కీలక నేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది కమల దళం.

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు కమిటీలో పెద్దపీట వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీజేపీ నేతలకు జాతీయ కార్యవర్గంలో పెద్ద పీట వేసింది.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని బీజేపీ నాయకత్వం కట్టబెట్టింది. ఏపీ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికీ బీజేపీ నాయకత్వం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది.
undefined
కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజికవర్గం ఫార్మూలాతో వచ్చే ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం ఉందని కమలదళం ప్లాన్ చేసినట్టుగా కనపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
undefined
2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకొంది.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి సుమారు 10 నుండి 12 శాతం ఓటు బ్యాంకు ఉంటుంది. ఏపీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజికవర్గం కీలకపాత్ర పోషించనుంది. దీంతో కాపు, కమ్మ సామాజికవర్గానికి బీజేపీ పెద్దపీట వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.
undefined
ఇక తెలంగాణ రాష్ట్రంపై కూడ బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 4 ఎంపీ స్థానాలు దక్కడం ఆపార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది.
undefined
గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవిని ఇచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా పదవి ఇవ్వడంతో బీసీలకు పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందనే సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో బీసీ జనాభా కూడ ఎక్కువ. తెలంగాణలో బీసీ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసింది బీజేపీ.
undefined
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ నియమించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు డీకే అరుణ కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని డీకే అరుణ ఆశించారు. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం డీకే అరుణకు కాకుండా బండి సంజయ్ కు బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం బాధ్యతలను అప్పగించింది.
undefined
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు మురళీధర్ రావు, రామ్ మాధవ్ కు కూడ కేంద్ర నాయకత్వం కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
undefined
click me!