బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు విషయంలో కరీంనగర్ పోలీసులు డెకాయిట్లలా పనిచేశారని, కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారని చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఆరోపించారు. గురువారం ఆయన బండిసంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.