చీటింగ్ చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ అని ఈటల మండిపడ్డారు. హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో దళిత బంధు అన్నారు... ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి బిసి బంధు అంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే బిసి, దళిత బంధు ఇస్తామని ఆ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాట వింటే మళ్ళీ గోస పడతారని ప్రజలకు ఈటల రాజేందర్ హెచ్చరించారు.