వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం మొంథా తుఫాన్ భద్రాచలం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర-వాయువ్య దిశలో కదులుతూ, రాబోయే ఆరు గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సిద్ధిపేట, సూర్యాపేట, భువనగిరి, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది.