వీరిలో మహబూబ్నగర్ అంబేద్కర్ కాలనీకి చెందిన విష్ణు ప్రకాష్ (27), రేణుక (55) అనే మహిళ ఉన్నారు. కాగా మరో మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. బుధవారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అయితే, చనిపోయిన వారు కల్తీకల్లు వల్ల చనిపోలేదని వైద్యులు చెబుతున్నారని అన్నారు. వారు తాగిన కల్లు నమూనాలను ల్యాబ్ కు పంపించామని తెలిపారు. అందులో గనక కల్తీ జరిగినట్లు తేలితే.. కల్లు కాంపౌండ్ నిర్వాహకులు, అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు.