నాగార్జునసాగర్ ఉపఎన్నికలు: కాంగ్రెస్ కి చావో రేవో

Published : Dec 11, 2020, 01:00 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ సన్నాహలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

PREV
117
నాగార్జునసాగర్ ఉపఎన్నికలు: కాంగ్రెస్ కి చావో రేవో

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశం ఉందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశం ఉందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది

217

 వరుస ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ కు నెలకొన్నాయి. 

 వరుస ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ కు నెలకొన్నాయి. 

317

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కొందరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకొంది

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కొందరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకొంది

417

రెండు ఎంపీ స్థానాలను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి విజయం సాధించాడు.

రెండు ఎంపీ స్థానాలను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి విజయం సాధించాడు.

517

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడ దక్కలేదు.ఈ స్థానంలో టీఆర్ఎస్ నుండి సీటు దక్కక కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తనయుడు చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్టు ఇచ్చింది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడ దక్కలేదు.ఈ స్థానంలో టీఆర్ఎస్ నుండి సీటు దక్కక కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తనయుడు చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్టు ఇచ్చింది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది.

617

అనారోగ్యంతో  నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఇటీవల మరణించారు. దీంతో ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. 
గత ఎన్నికల్లో సాగర్ నుండి మాజీ మంత్రి జానారెడ్డిపై నోముల నర్సింహ్మయ్య విజయం సాధించారు.

అనారోగ్యంతో  నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఇటీవల మరణించారు. దీంతో ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. 
గత ఎన్నికల్లో సాగర్ నుండి మాజీ మంత్రి జానారెడ్డిపై నోముల నర్సింహ్మయ్య విజయం సాధించారు.

717

నోముల నర్సింహ్మయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలోనే కొందరు నేతలతో సఖ్యత లేదు. తనకు వ్యతిరేకంగా  వ్యవహరించిన  వారిని  నర్సింహ్మయ్య పార్టీ నుండి సస్పెండ్ చేయించారు.ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరికి సీటు ఇస్తోందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నోముల నర్సింహ్మయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలోనే కొందరు నేతలతో సఖ్యత లేదు. తనకు వ్యతిరేకంగా  వ్యవహరించిన  వారిని  నర్సింహ్మయ్య పార్టీ నుండి సస్పెండ్ చేయించారు.ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరికి సీటు ఇస్తోందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

817

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  జానారెడ్డి ఈ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని  ప్రకటించారు.  ఈ స్థానం నుండి  జానారెడ్డి తనయుడు రఘువీర్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  జానారెడ్డి ఈ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని  ప్రకటించారు.  ఈ స్థానం నుండి  జానారెడ్డి తనయుడు రఘువీర్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

917

నాగార్జునసాగర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పాగా వేసింది. స్థానికేతరుడైనా కూడ ఈ స్థానంలో నర్సింహ్మయ్య విజయం సాధించాడు.

నాగార్జునసాగర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పాగా వేసింది. స్థానికేతరుడైనా కూడ ఈ స్థానంలో నర్సింహ్మయ్య విజయం సాధించాడు.

1017

ఈ దఫా  ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. జానారెడ్డి తనయుడికి కాంగ్రెస్ సీటును ఇచ్చే అవకాశం ఇస్తోందా లేదా మరొకరిని బరిలోకి దింపుతోందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.రఘువీర్ ను బరిలోకి దింపాలని జానారెడ్డి భావిస్తున్నారు. 

ఈ దఫా  ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. జానారెడ్డి తనయుడికి కాంగ్రెస్ సీటును ఇచ్చే అవకాశం ఇస్తోందా లేదా మరొకరిని బరిలోకి దింపుతోందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.రఘువీర్ ను బరిలోకి దింపాలని జానారెడ్డి భావిస్తున్నారు. 

1117

అభ్యర్ధి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటినుండే కసరత్తు ప్రారంభించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

అభ్యర్ధి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటినుండే కసరత్తు ప్రారంభించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

1217

టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకొంటుంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులను మంజూరు చేసింది. జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 

టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకొంటుంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులను మంజూరు చేసింది. జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 

1317

సాగర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. దీంతో గెలుపుపై ఆ పార్టీ విశ్వాసంతో ఉంది.  కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ నాయకత్వంలో నిరాశను నింపాయి.

సాగర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. దీంతో గెలుపుపై ఆ పార్టీ విశ్వాసంతో ఉంది.  కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ నాయకత్వంలో నిరాశను నింపాయి.

1417

సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీ క్యాడర్ లో జోష్ ను నింపొచ్చనే ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న బీజేపీకి ఈ ఉప ఎన్నికతో చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీ క్యాడర్ లో జోష్ ను నింపొచ్చనే ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న బీజేపీకి ఈ ఉప ఎన్నికతో చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

1517

అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో  చేదు ఫలితం వస్తే  రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో  చేదు ఫలితం వస్తే  రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

1617

ఈ ఉప ఎన్నికల్లో కూడ తమ సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేసుకొంటుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో సాగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. 

ఈ ఉప ఎన్నికల్లో కూడ తమ సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేసుకొంటుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో సాగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. 

1717

జాగ్రత్తగా అడుగులు వేసి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

జాగ్రత్తగా అడుగులు వేసి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

click me!

Recommended Stories