గత ఏడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. కానీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కోసం చలమల కృష్ణారెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని ప్రచారం సాగింది. కానీ, పార్టీ సీనియర్లంతా పాల్వాయి స్రవంతి వైపే మొగ్గు చూపారు. దీంతో పాల్వాయి స్రవంతికే కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది.