తెలంగాణలో రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కోసం వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.10,990 కోట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన పెట్రోలియం ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధికి గణనీయంగా నిధులిచ్చామని తెలిపారు.40 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి 11వేల కోట్లు ఖర్చుచేశామన్నారు.రామగుండంలో రూ.6300 కోట్లతో ఫెర్టిలైజర్ కంపెనీ ఏర్పాటుచేశామమన్నారు. బీబీనగర్ లో ఏయిమ్స్ ఆసుపత్రి దాదాపుగా పూర్తి కావస్తోంది అన్నారు. ఇలా తెలంగాణ కోసం ఎంతో చేస్తే ఏం చేసారని ప్రశ్నిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.