అయితే ఈ దఫా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వవద్దని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.
ఆదిలాబాద్ లో నలుగురు, కరీంనగర్ లో ఇద్దరు, ఖమ్మంలో ఇద్దరు, వరంగల్ లో ఇద్దరు, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు ఇవ్వవద్దని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. 2018లో ఏడుగురు సిట్టింగ్ లకు కేసీఆర్ సీట్లు నిరాకరించారు.ఈ ఏడు స్థానాల్లో పోటీ చేసిన కొత్త అభ్యర్థులు విజయం సాధించారు. ఈ దఫా కూడ 11 స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.