అనంతరం బేగంపేట విమానశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి కరీంనగర్ జిల్లాకు బయలుదేరారు ప్రకాశ్ అంబేద్కర్. నేరుగా హుజురాబాద్ కు చేరుకున్న వారికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.