భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామంలో దళిత యువకుడు టిఆర్ఎస్ నాయకుల చేతిలో హత్యకు గురయ్యాడన్న వార్తలపై వాస్తవాలు తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిజ నిర్ధారణ కమిటీ వేసిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అయితే నిజానిజాలు తెలుసుకునేందుకు మల్లారంకు బయలుదేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఎన్. రామచందర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తితో పాటు తనను కూడా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారని ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.
భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామంలో దళిత యువకుడు టిఆర్ఎస్ నాయకుల చేతిలో హత్యకు గురయ్యాడన్న వార్తలపై వాస్తవాలు తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిజ నిర్ధారణ కమిటీ వేసిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అయితే నిజానిజాలు తెలుసుకునేందుకు మల్లారంకు బయలుదేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఎన్. రామచందర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తితో పాటు తనను కూడా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారని ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.